Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గిరిజన తండాలో వైద్య శిబిరం

( జై భారత్ వాయిస్ గీసుకొండ )
గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని ఉపకేంద్రం నంద నాయక్ తండా,  మంగళ్ తండా లో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అర్చన తెలిపారు  ఈ క్యాంపు నిర్వహణ ఉప కేంద్రం డాక్టర్ సదానందం సి హెచ్ ఓ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి,తగిన సలహాలు సూచనలు, మందులను ఉచితంగా ఇవ్వడమైనది. ఈ వైద్య శిబిరంలో జ్వరంతో బాధపడుతున్న  8  మందికి రక్తనమోనాలు సేకరించి, మందులను ఇవ్వడం అయినది. ఈ వైద్య శిబిరంలో  సూపర్వైజర్స్ కిరణ్ కుమార్,స్వరూప, ఏఎన్ఎంలు రత్నవల్లి, రమ, హెల్త్ అసిస్టెంట్   లచ్చయ్య, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా విశ్వకర్మ యజ్ఞమహోత్సవం

Jaibharath News

జాతీయ నులిపురుగు దినోత్సవం

Sambasivarao

యాసంగి వరి సాగులోడ్రమ్ సీడర్ వేదజల్లే పద్ధతిపై రైతులకు అవగాహన