ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి ఆశీస్సులతో..
త్వరలో కళ్యాణదుర్గం లో KPL టోర్నమెంట్
జై భారత వాయిస్ కళ్యాణదుర్గంక: ళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నాయకత్వం లో అయన ఆశీస్సులతో ఇప్పటికే విద్య రంగంలో సొంత నిధులు లక్షలాది రూపాయలు వెచ్చించి మెగా డియస్సి ఉచిత కోచింగ్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెలువెత్తున్నాయి.అదే విధంగా క్రీడారంగంలో నూతనోత్సహం తెప్పించడానికి KPL పేరుతో క్రికెట్ టోర్నమెంట్నిజర్వహించేదుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేక బృందం స్థానిక కరణం చిక్కప్ప ప్రభుత్వం పాఠశాల గ్రౌండ్ పరిశీలించారు. క్రీడాభిమానులు దాదాపు 5 వేల మంది కూర్చోడానికి, డిజే, లైవ్ స్టేజ్, యూట్యూబ్ లైవ్,రాత్రి సమయంలో ఆడటానికి అదుతన లైట్స్ అమర్చడానికి పరిశీలించారు. కళ్యాణదుర్గం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మ్యాచ్ ఆడనున్నారు. ఎమ్మెల్యే క్రీడా స్ఫూర్తి పట్ల క్రీడా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.