A
కరువు భృతి బకాయిలను వెంటనే విడుదల చేయాలి: తిప్పేస్వామి
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అధ్యక్షులు శివప్రసాద్ అధ్యక్షతన బుధవారం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కార్య దర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ.. కరువు భృతి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రిటైర్డ్ వర్క్ ఇన్స్పెక్టర్ వీరభద్రయ్య రూ. 10 వేలతో పాటు బీరువాను సంఘానికి బహుకరించారు.