కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్న దేవరాజుకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆర్థిక సాయం
రూ.30వేలు సొంత నిధులు అందజేసిన బద్దే నాయక్.
జై భారత వాయిస్ కుందుర్పి,
కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న దేవరాజ్ అనే వ్యక్తి ఆర్థిక సాయం అందించారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గురువారం కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామానికి చెందిన వన్నూరక్క భర్త అయిన దేవరాజ్ సంవత్సరం నుండి కిడ్నీ మరియు వెన్నపూస వ్యాధితో బాధ పడుతున్నారు
వీరికి ఒక కుమారుడు కలడు వీరు రోజు వారి కూలి పనులకు వెళ్తూ జీవనం సాగించేవారు.
అకస్మాత్తుగా కిడ్నీకి ఇన్ఫెక్షన్ రావడంతో పనికి వెళ్లలేక రోజు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పూట గడవడం కష్టంగా ఉంది
దేవరాజు కు ఆపరేషన్ చేయాలని 3నెలల క్రితం డాక్టర్లు సూచించారుఆసుపత్రికి వెళ్ళడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతోఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ బద్దేనాయక్ రాత్రి ఫోన్ చేసి తమ బాధను తెలపగా ఉదయాన్నే వారి ఇంటికి చేరుకొని మానవతా దృక్పథంతో తన సొంత నిధులు 30,000/- ఇచ్చి ఆపరేషన్ కోసం కర్నూలు కు పంపించారు
కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు