కాకినాడ జిల్లా పరిధిలోని సూర్యారావుపేటలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ సంస్థ సమావేశం నిర్వహించారు,ఈ సమావేశంలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ వికాస్ పాండే ముఖ్యఅతిథిగా హజరైనారు. ఈ సమావేశంలో దిండి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగాను, ఎం. ఉదయ భాస్కర్ రాజుని కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గాను , ఎం రామకృష్ణ వర్మని , కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా భూపతి రాజు అనంత వర్మని కాకినాడ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే మాట్లాడుతూమా ఈ కన్జూమర్ కౌన్సిల్ సంస్థ ఇప్పటికే దేశంలో 220 కేసులకు పైగా న్యాయపోరాటం చేస్తూ వినియోగదారులకు న్యాయం జరిగే విధంగా తోడ్పడుతుందని అన్నారు , దానితోపాటు 1500 పైగా వివిధ రకాల అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగింది అని తెలియజేశారు ఇదేవిధంగా రానున్న రోజుల్లో కాకినాడ జిల్లాలో కూడా వినియోగదారులకి కొత్తగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులు అందరూ వినియోగదారులకి నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన న్యాయ సహకారాలు కూడా ఈ సంస్థ ద్వారా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సమస్త సభ్యులైనటువంటి దొడ్డి చంద్రశేఖర్, జీవరత్నం దాసరి , ప్రసాద్ రాజు , బీ.న్.బీ శంకర్ తదతరులు పాల్గొన్నారు.
next post