A
సరైన మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు,
జై భారత వాయిస్, కుందుర్పి
కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరైన మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ మాట్లాడుతూ కుందుర్పి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తక్షణమే బాత్రూమ్స్ మరియు టాయిలెట్స్ కట్టించాలని మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ ఓబుళపతి మరియు తిప్పేస్వామి గారితో వాగ్వాదం చేస్తున్న అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షుడు హర్షవర్ధన్ ఉపాధ్యక్షులు మురళి నాయకులు రాము హరి తదితరు విద్యార్థులు పాల్గొన్నారు.