Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

రైతు బజార్లో రిటైల్ దుకాణ వద్ద బియ్యం కందిపప్పు అమ్మకాలు ప్రారంభించిన ఆర్డిఓ రాణి

A

ప్రజలకు అందుబాటు ధరలో నిత్యావసర సరుకులు.

రైతు బజార్లు, రిటైల్ దుకాల వద్ద బియ్యం, కందిపప్పు అమ్మకాలు ప్రారంభించిన ఆర్డీఓ రాణి సుస్మిత, ఎమ్మెల్యే అమిలినేని అల్లుడు ధర్మ తేజ

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు కందిపప్పు, సోనా మసూర బియ్యం అందించాలనే ఉద్దేశ్యంతో నేడు ధరలు తగ్గించి వాటి విక్రయాలు నేడు ప్రారంభించారు. గత ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, మిల్లర్లతో చర్చించి వాటిని ప్రభుత్వం ప్రతి రిటైల్ దుకాణాలు, రైతు బజార్లలో అందుబాటులోకి తెచ్చింది.. వాటిని నేడు కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాలతో ఆయన అల్లుడు దేవినేని ధర్మ తేజ, ఆర్డీఓ రాణి సుస్మిత ప్రారంభించారు. *బయట మార్కెట్లో కందిపప్పు 181 రూపాయలు ఉండగా ప్రభుత్వం 160 రూపాయలకు, సోనా మసూర బియ్యం బయట 55.85 రూపాయలు ఉండగా వాటి ధరను 49 రూపాయలకు విక్రయించనున్నారని తేజ పేర్కొన్నారు.

Related posts

ఎస్సై వెంకటస్వామికి ఘనంగా సన్మానం

Jaibharath News

సాహిత్య పుట్టినరోజు సందర్భంగా వేడుకలు

Gangadhar

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించండి.అమిలినేని