A
జై భారత వాయిస్,, కుందుర్పి
కుందుర్పి మండలం అపిలేపల్లి స్థానిక జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల లో ఆర్.డి.టి,మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలుఅరికడదాంఆడబిడ్డలను కాపాడుదాం అనే కార్యక్రమం ఆర్ డి టి మహిళా విభాగం టీం లీడర్ ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంబదూరు ప్రాజెక్ట్ మహిళా శిశు అభివృద్ధి పథక అధికారిని వనజ అక్కమ్మ మరియు కుందుర్పి మండల విద్యాధికారి తిప్పేస్వామి విచ్చేసినారు.
కంబదూరు ప్రాజెక్ట్ మహిళా శిశు అభివృద్ధి పథక అధికారిని వనజ అక్కమ్మ మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల అమ్మాయిలు మానశిక, శారీరక ఒత్తిడికి గురి కావడం మరియు ప్రసవ సమయంలో తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోతారని తెలుపుతూ ఆడ పిల్లలకు 18 సంవత్సరాలు మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహ ప్రయత్నాలు చేయడం ఉత్తమము అని తెలియజేశారు అలా కాకుండా బాల్య వివాహం చేయాలని చూస్తే బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాo చేసుకున్న, నిర్వహించిన, సహకరించిన మరియు హాజరైన ప్రతి ఒక్కరూ శిక్షార్హులు ఇందుకు గాను రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా లేదా రెండు విదింప బడుతాయి అని తెలియజేస్తూ ఎక్కడైనా బాల్య వివాహాలు చేయాలని ప్రయత్నిస్తుంటే వెంటనే టోల్ ప్రీ నంబర్లు 1098, 100 మరియు 112 లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేస్తూ ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పని చేసినపుడే బాల్య వివాహ వ్యవస్థను రూపు మాపవచ్చునని వారు తెలిపినారు.
ఆర్ డి టి మహిళా విభాగం టీం లీడర్ ఆదినారాయణ మాట్లాడుతూ సమాజంలో బాలల పట్ల వివక్షత తీవ్రరూపం దాల్చిందని బాల్య వివాహాలు,బాలలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని బాలలను మరియు వారికున్న హక్కులను ( జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు మరియు భాగస్వామ్యపు హక్కు ) కాపాడవలసిన భాద్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని తెలియజేశారు అందులో బాగంగా ఆర్ డి టి సంస్థ ప్రతి మండలంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణ కోసం ముందస్తు చర్యగా గ్రామ స్థాయిలో మరియు పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అందులో ముఖ్యంగా బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ వలన కలిగే అనర్థాలను లఘు చిత్రాల ద్వారా తల్లిదండ్రులకు మరియు చిన్నారులకు అర్థమైయ్యే విదంగా అవగాహన కల్పిస్తున్నామని కాబట్టి అమ్మాయిలు తల్లిదండ్రులకు నమ్మకాన్ని ఇస్తూ చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకోవాలని అంతే కాకుండా ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం కోసం మధ్యలో ఎదురైయ్యే చిన్న చిన్న ఆకర్షణలను త్యాగం చేసినపుడే గొప్పవారు అవుతారని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సుశీలమ్మ , ప్రధానోపాధ్యాయులు ధనుంజయ, ఉపాధ్యాయులు జయశ్రీ, జయరాం నాయక్, నలిని, సుగుణ, జయలక్ష్మి, వైద్య సిబ్బంది భార్గవి, అంగన్వాడి కార్యకర్తలు మరియు చిన్నారులు పాల్గొన్నారు.