జై భారత్ వాయిస్ ‘ నూజివీడు మండలం దేవరగుంట గ్రామానికి చెందిన సుమారు 65 మంది కలిసి ఒక ప్రవేటు వాహనంలో నిన్న ఉదయం జంగారెడ్డిగూడెం గూడెం సమీపంలో గల గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లిన భక్తులు అకస్మాత్తుగా ఒక్కసారిగా వచ్చిన వరదల్లో నిన్న రాత్రి సమయంలో చీకటి అరణ్యంలో చిక్కుకున్న 65 మంది భక్తులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఇక దేవుడే మనల్లి రక్షించాలని అనుకొని గుబ్బల మంగమ్మ తల్లికి మొక్కుకొని తల్లిని వేడుకుంటున్న సమయం అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వంకాయలు హరిబాబు స్పందించి రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి కి సమాచారం అందించగా వెంటనే స్పందించిన మంత్రివర్యులు RTC, డిపో మేనేజరు ఇతర అధికారులతో మాట్లాడి తక్షణమే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులకు ఆదేశించిన మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించన వెంటనే ఆర్టీసీ డీఎం ఒక ప్రత్యేక బస్సు ను ఏర్పాటుచేసి భక్తులను వారి గమ్య స్థానాలకు చేర్చిన RTC సిబ్బంది, ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో అని అధైర్య పడే సమయంలో మా మనవి ఆలకించి మమ్మల్ని ప్రాణాలతో ఇంటికి సురక్షితంగా చేర్చిన రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రికి జీవితాంతం ఋణ పడివుంటామని భక్తులు కృతజ్ఞతను.ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మంత్రిని మునుపెన్నడూ మేము చూడలేదని ఎప్పుడు మీరే మాకు ఎం.ఎల్.ఏ ఉండాలని ఆ గుబ్బల మంగమ్మ తల్లిని కోరుకుంటున్నామని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

previous post