Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

నూజివీడులోనేడు సుందర నగరంలా రూపుదిద్దుకుంటున్న N.T.R కాలనీ..

జై భారత్ వాయిస్ ‘   నూజివీడు పట్టణంలో గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన N T R కాలనీ లో కనీస అవసరాలు కూడా లేక నానా ఇబ్బందులు పడుతూ అభివృద్ధికి ఆమడధూరంలో ఉన్న కాలనీ వాసులు నేడు ఎంతో సంతోషంగా ఉన్నారు, దీనికి కారణం గతంలో కనీస అవసరాలు త్రాగునీరు మురిగినీరు, రోడ్లు, లేక ఎంతో దుర్భర జీవితం గడిపే వాళ్ళమని కాలనీ వాసులు తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు, గత నెలరోజుల క్రితం ఏర్పడిన కొత్త ప్రభుత్వములో నూజివీడు ఎమ్, ఎల్, ఎ, గారైన రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు నెల రోజులకే త్రాగునీరు, మురిగినీటి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తున్నారని ఇక నుండి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ఎంతో ఆనందంగా జీవిస్థామని తమ హర్సాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు గతంలో మురిగినీటి వ్యవస్థ త్రాగునీరు వ్యవస్థ లేక కాలనీ రోడ్లు లేక కాలనీ మొత్తం నీటితో మునిగిపోయి ఇళ్ళల్లోకి నీరు చేరేదని కనీసం నడవడానికి ఇంటికి రావడానికి కూడా రోడ్లులేక చాలా ఇబ్బందులు పడ్డామని కాలనీ వాసులు. తమ ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కాలనీ మొత్తం నీటితో మునిగి పోయి ఒక చెరువులా ఉండేదని తద్వారా ఇళ్ళల్లోకి విష సర్పాలు, దోమలు చేరి రోజు జ్వరాలు దగ్గు, చర్మ రోగాలు, అతిసార వ్యాధితో బాధ పడుతూ నానా కష్టాలు పడే వాళ్ల మని కష్టపడ్డ సంపాదన అంతా హాస్పిటల్స్ మందులకే సరిపోయేదాని కానీ ఈ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి  వచ్చాక త్రాగునీరు 24 గంటలు అందుతున్నాయని మురిగి నీటి డ్రైనేజీలు వ్యవస్థ మరియు విద్యుత్ దీపాలు రోజూ వెలుగుతున్నాయని దీనంతడితో మా జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని కాలనీ వాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంతటి అభివృద్ధికి ఆనందానికి కారణమైన మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారికి జీవితాంతం రుణపడి ఉంటామని ఎప్పటికీ మీరే మా ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ తమ హర్సాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు..

Related posts

కేంద్ర బడ్జెట్ లో అంధ్రప్రదేశ్ కు భారీ కేటాయింపులు కూటమి ప్రభుత్వ విజయం

KATURI DURGAPRASAD

నూజివీడు నందనం తోటలో గణేష్ పూజ కార్యక్రమం

KATURI DURGAPRASAD

గొర్రెల కాపరుల సమస్యలు పరిష్కరిస్తాం..

KATURI DURGAPRASAD