న్యూఢిల్లీ / ఏలూరు: జూలై 29: జై భారత్ వాయిస్ పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో 85వ ప్రశ్నపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ యువతలో నైపుణ్యత పెంచి, ఉపాధి ప్రోత్సాహకాలను ప్రకటించిన ఆర్ఢికమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 2019 – 2024 మద్యన ఉన్న ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో విఫలమైందని, జాతీయ సగటుతో పోలిస్తే నిరుద్యోగ శాతం అంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు యువత సామర్ధ్యాన్ని గుర్తుంచేందుకు నైపుణ్యఆధారిత జనాభా గణనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.
దేశ జనాభాలో 5వ వంతు పైగా ఉన్న మన తాజా పట్టభద్రుల, యువనిపుణులు మరియు యువత ప్రయోజనాల కోసం దేశం మొత్తానికి ఒకే విధమైన నైపుణ్య గణనను నిర్వహించడానికీ కేంద్రప్రభుత్వం పరిశీలిస్తుందా? లేదా అవి గౌరవ కేంద్రమంత్రి నుండి తెలుసుకోగలుగుతున్నని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు అన్నారు.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రివర్యులు మన్ సుఖ్ మాండివ్య మాట్లాడుతూ యువతకు ఉపాధికోసం సాధికారత, నైపుణ్యత చాలా అవసరం. యువత ఉపాధి అవకాశాలు అడుగుతున్నారు. ప్లంబర్, కార్పెంటర్ వంటి వృత్తి నిపుణుల కొరత చాలా ఉంది. మంచి ప్రశ్న వేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారిని అభినందించారు. యువతలో నైపుణ్యత వెలికి తీయటానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 500 ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కోటి మందికి శిక్షణ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామన్నారు.