Jaibharathvoice.com | Telugu News App In Telangana
ప్రకాశం

అర్హులైన వారికి తోపుడుబండ్లు, కుట్టుమిషన్లు అందజేసిన మంత్రి డాక్టర్ నారాయణ, ఆయన కుమార్తె షరణి

జై భారత్ వాయిస్ న్యూస్ నెల్లూరు
నిరుపేదల జీవనోపాదులు మెరుగుపరచడమే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని… దానికి తగ్గట్లు నెల్లూరులోని నిరుపేదలకు తమ ట్రస్ట్ ద్వారా ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత సహాయం అందజేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి తెలియజేశారు. నెల్లూరు గోమతి నగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో కలిసి ఆమె… 23 మందికి తోపుడు బండ్లు, 40 మందికి కుట్టుమిషన్లను అందజేశారు. అక్కడికి వచ్చిన నిరుపేదలైన వారందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ… వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవనోపాదులు మెరుగుపరుచుకోవాలని సూచనలనిపిస్తూ… ఎంపిక చేసినవారికి తోపుడుబండ్లు, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. తమను గుర్తించి తమ విజ్ఞప్తి మేరకు అడిగిన వెంటనే సాయం అందజేసిన మంత్రి డాక్టర్ నారాయణకు, ఆయన కుమార్తె షరణీకి… నిరుపేదలైన వారందరూ ఆయా వస్తువులను తీసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కుమార్తె షరణి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని ఆయా డివిజన్ల పరిధిలో పర్యటిస్తున్నప్పుడు తమ దృష్టికి పలువురు తమ సమస్యలను తెలియచేసి ఆర్థిక సహాయం కోరారన్నారు. తమ బతుకుదెరువు మెరుగుదల కోసం సాయం చేయాలని విన్నవించారని చెప్పారు. నిరుపేదలందరి విజ్ఞప్తి మేరకు తమ కుటుంబ సభ్యులంతా కలిసి నారాయణ ట్రస్ట్ ఏర్పాటు చేసి కొంత నిధులు సమకూర్చి… ఆ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు ఆర్థిక సహాయం మరియు జీవనోపాదుల మెరుగుదలకు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గతంలో 200 మందికి తోపుడు బండ్లు అందజేయగా… ప్రస్తుతం తాజాగా మరో 23 మందికి తోపుడు బండ్లు అందజేయడంతో పాటు అర్హులైన 40 మందికి కుట్టుమిషన్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా ప్రతిరోజు వారి పని చేసుకుంటూ కొంతమేర వారి కుటుంబాలకు ఆధారంగా ఉంటుందన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తన తండ్రి నారాయణకు వారి కష్టాలు తెలుసన్నారు. అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన పనులన్నీ చేస్తున్నామని భరోసా ఇచ్చారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు రాష్ట్ర అభివృద్ధితో పాటు ఇటు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ నెల్లూరు నగరాన్ని మెట్రో సిటీగా మార్చేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు హామీలను నెరవేర్చారని కొనియాడారు అందులో భాగంగా వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ పెంపుదల, అన్న క్యాంటీన్ల పున ప్రారంభం తదితర అంశాలన్నీ నిరుపేదలకు కలిసివచ్చే మహాద్భుతమైన పథకాలని తెలిపారు. ఇదే విధంగా టిడిపి ప్రభుత్వ పరిపాలన పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని షరణి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు.. టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దర్శి అసెంబ్లీ ప్రజల సేవకు నేను రెడీ.మదిరె రంగ సాయి రెడ్డి

గోవింద నామస్మరణతో శ్రీగిరి గిరి ప్రదక్షిణ.