జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 హన్మకొండ ప్రతినిధి:-
హసన్పర్తి మండలంలోని ఎంజేబీ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సహాయా కార్యదర్శి కాసరబోయిన రవితేజ హాజరై మాట్లాడుతూ. విద్యార్థులు చదువుతోపాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు కోవాలని నేటి విద్యార్థులే రేపటి భావిభారత నిర్మాతలని క్రమశిక్షణ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అవరోధించాలని విద్య కాషాయకరణకు, విద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు సైతం పోరాటం చేయాలని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సబ్యులు బండారి ప్రవీణ్ పాల్గొన్నారు.
