జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సులలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు సెప్టెంబర్ 30 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వల్లూరి రామచంద్రం ఒక ప్రకటన లో తెలిపారు. మొత్తం 33 కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నామని వివరించారు. డిగ్రీలో బిఎ, బీకాం, జనరల్ కంప్యూటర్స్, బి బి ఏ, బీఎస్సీ, బి ఎల్ ఐ ఎస్సీ, ఏం. ఎ. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరి, రూరల్ డెవలప్ మెంట్, సో సి యాలజీ, హెచ్. ఆర్. ఎం, ఏం. కామ్, సోషల్ వర్క్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎమ్మెస్సీ సైకాలజీ, గణిత శాస్త్రం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వృక్ష, జంతు శాస్త్రాలు, ఎం ఎల్ ఐ ఎ స్సీ ఉన్నాయని డిప్లమా కోర్సులలో కంప్యూటర్ అప్లికేషన్స్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, యోగా, సర్టిఫికెట్ కోర్సులో సి ఎల్ ఐ ఎస్సీ, మిమిక్రీ లో ఓరియంటేషన్ కోర్సులకు ప్రకటన జారీ చేశామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటో జత చేసి, కోర్సు రుసుము ఆన్ లైన్ లో గాని దురవిద్యా కేంద్రం ఎస్బిఐ ఎక్స్ టెన్షన్ కౌంటర్ నుంచి చాలానా ద్వారా గాని చెల్లించ వచ్చునన్నారు. కోర్సులు, ఫీజులు మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్. 0870-2461480,2461490 లలో సంప్రదించాలని ఆచార్య వల్లూరి రామచంద్రం సూచించారు అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశం వినియోగించు కోవాలని కోరారు.
