Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్ జిల్లాలోని భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామాలల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:
మహబూబాబాద్ జిల్లా భారీ వర్షాల దెబ్బతిన్న సిరోలు మండలంలోని పురుషోత్తమాయగూడెం, సీతారాంపురం గ్రామాలను, నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామాలలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో పర్యటించి పరిశీలించిన అనంతరం వరద నష్టంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని సీఎం తెలిపారు. వరద ప్రభావం తగ్గిన అనంతరం విష జ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, స్థానిక ఎమ్మెల్యేలు మురళి నాయక్, జాటోత్ రాంచంద్ర నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కలెక్టర్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (మల్లన్న), ఎస్పీ, ఉన్నత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

బిజెపి తొర్రూరు అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సీరోల్ ఎస్సై నగేష్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

కన్నీటి పర్యంతమైన మంత్రి సీతక్క ఎందుకంటే