*నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా రైతుల భూములకు ఉపయోగపడే విధంగా ఉండాలి*
హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 హనుమకొండ ప్రతినిధి:-
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములపై అనుభవిస్తున్న రైతుల భూములు హక్కులు లేక ఇబ్బంది పడుతున్న విషయాల గురించి. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ తరఫున హన్మకొండలో ఎమ్మెల్యే ఇంటి వద్ద మెమోరండం అందించడం జరిగింద. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కన్వీనర్ సోమీడి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు వ్యవసాయ భూములపై హక్కు పత్రాలు లేక ప్రభుత్వం నుండి అందే సహాయాన్ని అందక అనేకమైన ఇబ్బందులు పడుతూ తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ అనేకమంది రైతులు తిరగలేక ఇబ్బందికి గురవుతున్నారు. సేద్యం చేస్తూ పంటలు పండిస్తున్న భూములపై హక్కు పత్రాలు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు వీరు సేద్యం చేస్తున్న భూములు ఎలాంటి అట్టి భూమిపై హక్కులేని వారు రికార్డుల్లో ఉంటున్నారు.
రికార్డుల్లో వీరిని మార్పిడి చేయాలంటే చేయలేని పరిస్థితిలో అధికారులు ఉండడం వలన రైతుల ఇబ్బందులు పడుతున్నారు
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తూ 19 పేజీలతో ఒక డాక్యుమెంట్ను ప్రజల సలహా సూచనల కొరకు విడుదల చేయడం జరిగినది
ఈ డాక్యుమెంటు మొత్తాన్ని పరిశీలించి మా తెలంగాణ రైతు సంఘం కమిటీ తరఫున రైతులు సేద్యం చేస్తున్న భూములపై ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతూ కొన్ని సలహా సూచనలు తెలియజేయడం జరుగుతుంది.
1) ధరణి పోస్టల్ ను సవరణ చేయాలి.
2) సాదా బాయి నామ అమలు చేయాలి.
3) ప్రతి గ్రామానికి రెవిన్యూ ఉద్యోగిని నియమించాలి, రికార్డును భద్రత పరుస్తూ ప్రతి సంవత్సరం జమాబంది చేయాలి.
4) రాష్ట్రవ్యాప్తంగా సర్వేనెంబర్ యూనిటీగా తీసుకొని భూములు సర్వే చేయాలి.
5) రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుకింగ్ చేసుకునే ముందే ఏమైనా లోపాలు ఉంటే రూపాయలు కట్ కాకముందే కంప్యూటర్ లో దీనిని అభ్యంతరాన్ని చూపించాలి.
6) రైతుల బ్యాంకర్ల వద్ద రుణం పొందినప్పుడు బ్యాంకు వారు 1బి మాత్రమే పరిణోగంలోకి తీసుకోవాలి పాస్ పుస్తకం తీసుకోకూడదు
7) పహణిలో ఖాస్తూ కాలం ఉండాలి. పైన తెలిపిన విషయాలను రైతులకు ఉపయోగపడేలా విధంగా చట్టాలు రూపొందించి రైతు ప్రభుత్వం అనే విధంగా చూడాలని తెలంగాణ రైతు సంఘం కమిటీ తరఫున ప్రభుత్వానికి విన్నపం చేస్తు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య సంఘ కోశాధికారి సిరుల రవీందర్ జిల్లా కమిటీ సభ్యులు జెండా అంబయ వజ్ర రాజు మహేందర్ సాంబయ్య శేఖర్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.
వజ్ర రాజు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ నాయకులు.