Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఘనంగా కుడా ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలు

*ఘనంగా కుడా ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలు* 

హన్మకొండ 

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 హనుమకొండ ప్రతినిధి:-

ఇనగాల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఇనగాల యువసేన ఆధ్వర్యంలో కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 55 వ పుట్టిన రోజు వేడుకలను సుబేదారి లోని ఇండియన్ రెడ్ క్రాస్ కార్యాలయంలో నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఆన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులైన ఇనగాల అవంతి రెడ్డి, డా. పాఖాల్ వివేకానంద రెడ్డి, డా. అనీష్ రెడ్డి భీమిడి, డా. పాఖాల్ సాకేత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో చికిత్స పొందుతున్న బాదితులను పరిశీలించి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో 300 మంది పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Related posts

మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

Sambasivarao

సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శం మంత్రి కొండా సురేఖ

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి*

Jaibharath News