*తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా దయ్యాల ప్రభాకరు*
హైదరాబాద్
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 వరంగల్ ప్రతినిధి:-
హైదరాబాద్ బీసీ భవనులో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యుడు (ఎంపీ) ఆర్ కృష్ణయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరత్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న ప్రభాకరు. తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా హైదరాబాద్ బీసీ భవనులో వరంగల్ నగరంలోని ఓ సిటీ ప్రాంతానికి చెందిన దయ్యాల ప్రభాకరుని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరత్ నియమించారు. నియామక పత్రాన్ని రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నూతన అధ్యక్షులు దయ్యాల ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ పదవి రావడానికి కృషి చేసిన జిల్లా రాష్ట్ర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ బీసీ ప్రజా సంఘం బలోపేతానికి వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మండల కేంద్రంలో నూతన కమిటీలు వేసి సంఘం అభివృద్ధికి తోడ్పడుతానని ప్రభాకర్ అన్నారు.