Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

తెలంగాణ సాధనలో, ప్రగతిలో కాళోజి స్ఫూర్తి

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 హనుమకొండ ప్రతినిధి:-ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హనుమకొండ కలెక్టర్ ప్రవీణ్య తో కలిసి నక్కలగుట్ట లోని కాళోజీ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈసందర్భంగా కుడా ఛైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఆదర్శప్రాయుడు కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని చెప్పారు. తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ద్వారా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడుగా అభివర్ణించారు. వారి రచనల స్ఫూర్తి తెలంగాణ సాధించడానికి మరింత దోహదం చేసిందని తెలిపారు. భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానింప బడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు. కాళోజీ రచనలతోనే యువతను తెలంగాణ ఉద్యమంవైపు నడిపించాయని, తన రచనల ద్వారా పెత్తందారీ వ్యవస్థ అన్యాయాలను ఎదిరించాడని. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాళోజీ రచనలు యువతలో స్ఫూర్తినిరగిలించి నాయని, సామాజిక సమస్యలపై పోరాడిన మహనీయుడు కాళోజి అని స్మరించుకున్నారు.

Related posts

బిఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ది సాధ్యం: ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News

ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల!

కాజీపేట దర్గా ఉత్సవాలలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్