జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 వరంగల్సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటు అని సిపిఎం పార్టీ అయినవోలు మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య అన్నారు.కామ్రేడ్ ఏచూరి విద్యార్థిదశ ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శిగా ఆ తర్వాత సిపిఎం పార్టీ రాజ్యసభ సభ్యునిగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక పదవి బాధ్యతలు చేపట్టి ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని అన్నారు. ఏచూరి మరణం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని లింగయ్య అన్నారు.
