జైభారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 18
గీసుకొండ మండల సీనియర్ ఫ్రీలాన్సర్ పాత్రికేయులు (మాజీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్) మేకల దాస్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల గీసుకొండ ప్రెస్ క్లబ్ సభ్యులు,జర్నలిస్టుల విచారం వ్యక్తం చేశారు, భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకోవచ్చి ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు తెలియజేసి సమస్యలను పరిష్కరించారని వారు పేర్కొన్నారు
