జైభారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 18
గీసుగొండ గ్రామానికి చెందిన ఫ్రీలాన్స్ పాత్రికేయులు మేకల దాస్ గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని పరకాల నియోజకవర్గం అధికార ప్రతినిధి చాడ కోమురారెడ్డి గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ మృతుడి కుటుంబాన్ని బుధవారం పరామర్శించి దాస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కూసం రమేష్ ,జావిద్ ,మాజీ కాంగ్రెస్ నాయకులు దౌడు భరత్ మాజీ గీసుగొండ మండల యూత్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు దౌడు ప్రవీణ్ దూల వెంకన్న కేదాసి మోహన్ మేకల యాకూబ్ దౌడు సునీల్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post