*ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలకు డైరీల బహుకరణ.*
హన్మకొండ జిల్లా//శాయంపేట మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 పరకాల ప్రతినిధి:-
శాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్నా విద్యార్థినిలందరికీ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు క్రీస్తు శేషులు సామల వీరేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి డైరీలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సామల బిక్షపతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు రోజు సబ్జెక్టు వారీగా ఇచ్చే హోంవర్క్ లను శ్రద్ధగా రాసి డైరీలలో పేర్కొని విద్యార్థులు ఉపాధ్యాయులకు చూపించాలని ఏమైనా రిమార్కు ఉంటే ఉపాధ్యాయులు డైరీలో రాస్తారని అన్నారు అలాగే విద్యార్థినిలు క్రమశిక్షణతో బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తమ పాఠశాలకు ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత ఉపాధ్యాయులు శేఖర్ బాబు సుజాత ఉమాదేవి రేణుక లక్ష్మీబాయి కుమారస్వామి కృష్ణవేణి విద్యార్థినిలు పాల్గొన్నారు.