Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సత్ఫలితాలు ఇస్తున్న పాఠశాల కిచెన్ గార్డెన్స్

*సత్ఫలితాలు ఇస్తున్న పాఠశాల కిచెన్ గార్డెన్స్* 

 

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం 

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 వరంగల్ ప్రతినిధి:-

 

గీసుకొండ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యాశాఖ ఆదేశానుసారం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. కిచెన్ గార్డెన్ ద్వారా పండించిన కూరగాయలను విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వండి పెట్టడం కొరకు, మధ్యాహ్న భోజన కార్మికురాలు మున్నికి స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం పట్టాభి మరియు కిచెన్ గార్డెన్ ఇంఛార్జి సబిత అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోత్స్న ప్రభ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతిపక్ష నాయకులారా సిగ్గుపడండి ఏ మొహం పెట్టుకుని రోడ్లపైకి వస్తారు

శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులు పరకాల ఎమ్మేల్యే ప్రకాష్ రెడ్డి సందర్శించారు,

ఆమ్మ ఆదర్శ పాఠశాలల పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య