*నిరుపేద వ్యక్తి దహన సంస్కారాలకి ప్రజలను చైతన్యపరిచి దయాగుణం చాటుకున్న పోలీస్ అధికారి*
వరంగల్ జిల్లా//చెన్నారావుపేట మండలం//పాపయ్యపేట గ్రామం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 నర్సంపేట ప్రతినిధి:-
మృతునికి నా వంతు సాయం చేస్తానని మనసున్న రారాజు చెన్నారావుపేట మండలం పాపయ్య పేట గ్రామనికి చెందిన చిరుత అనిల్ గత కొద్ది రోజుల నుండి కడుపునొప్పితో బాధపడుతూ పట్టించుకునే వారులేక ఎవరితో చెప్పకోలేక గురువారం రాత్రి ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. మృతుని అంత్యక్రియలకు డబ్బులు లేవని తెలుసుకునీ విధుల్లో భాగంగా పాపయ్యపేట గ్రామనికి చేరుకున పోలీస్ అధికారి వల్లే క్రాంతి మృతునికి సంతాపం తెలియజేసి మృతుని దహనసంస్కారాలకి సహాయం చేయమని గ్రామంలో ఉన్నటువంటి వారిని మీకు తోచినంత సహాయం చెయ్యండి అని పాపయ్య పేటలో ఉన్నటువంటి గ్రామస్తులను చైతన్యపరిచి. నా వంతు సహాయం చేస్తున్న మీ వంతు సహాయం చేయండి అని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను గ్రామా అధికారులను ముందుకు వచ్చి మృతుని అంత్యక్రియలకు సహాయం చేయాలని వల్లే క్రాంతి కోరారు. పాపయ్యపేట గ్రామంలోని ప్రజలు వారికి తోసిన సహాయాన్ని అందజేశి సంప్రదాయబద్ధంగా చిరుత అనిల్ అంతక్రియలు చేశారు. అంత్యక్రియలు ముగిసేవరకు ఉండి మృతునికి సహాయం చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన వల్లి క్రాంతి.