*తెలంగాణ భవన్ లో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు..ఎంపి రవిచంద్ర*
హైదరాబాద్//తెలంగాణ భవన్జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 హైదరాబాద్ ప్రతినిధి:-
బాపూజీ 12వ వర్థంతి సందర్భంగా శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు, ముందుగా బాపూజీ చిత్రపటానికి పూలదండలు వేసి, పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ న్యాయవాదిగా, మంత్రిగా, పోరాటయోధుడిగా తెలంగాణ సమాజానికి, బడుగు బలహీన వర్గాలకు బాపూజీ చేసిన సేవల్ని ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, రావుల చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, బాల్క సుమన్, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్, జూలూరు గౌరీశంకర్, చిరుమళ్ల రాకేష్, గజ్జెల నగేష్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, వాసుదేవ రెడ్డి, ఉపేంద్రాచారి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితర ప్రముఖులు బాపూజీ చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు.