Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

శివనగర్ ఉన్నత పాఠశాల నందు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిచే స్వచ్ఛత పట్ల అవగాహన కార్యక్రమం

*శివనగర్ ఉన్నత పాఠశాల నందు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిచే స్వచ్ఛత పట్ల అవగాహన కార్యక్రమం* 

వరంగల్ జిల్లా//శివనగర్ 

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 వరంగల్ ప్రతినిధి:-

ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివనగర్ నందు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిచే విద్యార్థులకు స్వచ్ఛత పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ జవాన్ ప్రేమ్ మరియు అశోక్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా సిబ్బంది పర్యావరణ పరిరక్షణ కు పరిసరాల పరిశుభ్రతకు మనము ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేశారు అంతేకాక ప్రతినిత్యం తడి చెత్త పొడి చెత్త మరియు వైద్యపరమైన వ్యర్థాలను ఏ విధంగా వేరు వేరు డబ్బాలలో వేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలో విద్యార్థులకు తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు స్వచ్ఛత పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి ప్రయత్నించారు అంతేకాక విద్యార్థులు స్వచ్ఛత కోసం పరిసరాల పరిశుభ్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ రెండు వరకు నిర్వాహన ద్వారా ప్రజల్లో స్వచ్ఛత పట్ల అవగాహన పెంపొందించి వ్యాధులనుంచి దూరంగా ఉండేందుకు కృషి చేస్తుందని అందులో భాగంగా ఈరోజు మన పాఠశాలలో మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంజయ్య శ్రీనివాస్ దేవరాజ్ రంగాచారి కవిత సుజాత సందీప్ కిరణ్ మైలు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాక విజయ్ కుమార్ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయుల ఆవార్డులకు దరఖాస్తులు

Sambasivarao

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

రాష్ట్ర  స్థాయి యోగ పోటీలు ముగింపు