Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి నివాళీలు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి నివాళీలు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. 

 

హన్మకొండ 

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 హనుమకొండ ప్రతినిధి:-

నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాలతో తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం )లో ఆయన సేవలను గుర్తు చేసుకొని వారికి ఘన నివాళులు అర్పించారు. స్వరాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగనిరతి తొలి, మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్ర మరవలేనిదని అయన సేవలను కొనియాడారు. మాజీ కార్పొరేటర్లు ఏ నాగరాజు, రావుల సదానందం, నెక్కొండ కిషన్ సీనియర్ నాయకులు దేవన విష్ణు వర్ధన్ రెడ్డి, కొలిపాక సతీష్, షేక్ అమర్, మండల సమ్మయ్య, బంక సంపత్, నాయిని లక్ష్మా రెడ్డి, తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి, మొహమ్మద్ జాఫర్, సింగారపు రవి ప్రసాద్, వల్లాపు రమేష్, తడక సుమన్ గౌడ్, బోనగని యాదగిరి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సైలానీ బాబా దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యేలు

Jaibharath News

అంబేద్కర్ కు ఉపాధ్యాయ నేతల ఘన నివాళులు

సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలి