Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తూర్పు కోటలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

*తూర్పు కోటలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు*

వరంగల్ జిల్లా//ఖిల్లా వరంగల్

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 22 వరంగల్ ప్రతినిధి:-

ఖిల్లా వరంగల్ 37వ డివిజన్ పరిధిలోని తూర్పు కోట పోచమ్మ గుడి ఆవరణలో డా, అచ్చ వరుణ్ బాబు, డా, సునీత (అచ్చ)తిప్పని సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిభిరంను స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, మాజీ కార్పొరేటర్ అచ్చ లక్ష్మి వీరేష్ బాబులు ప్రారంభించారు.. ఈ సందర్బంగా శిభీరాన్ని, ప్రజలను ఉద్దెశించి కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, మాజీ కార్పొరేటర్ అచ్చ లక్ష్మి వీరేష్ బాబులు మాట్లాడుతూ సొంత ఊరిర్లో ప్రజలకు వర్షాకాలం కావడం వలన వైరల్ ఫెవర్స్, డెంగ్యూ, మలేరియా విష జ్వరాలు విస్తరించడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేసిన డా, వరుణ్ బాబు, డా, సునీతలను అభినందించారు. అలాగే చిన్న పిల్లలకు ఈ కాలంలో దగ్గు, జలుబు ఎక్కువగా వస్తుందని పిల్లల వైద్య నిపుణులు డా, సునీత ప్రత్యేకంగా టీకాలు, సిరప్ లు మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు వరుణ్ హాస్పటల్ లో ఉచితంగా ఓపి చూస్తారని పిల్లలకు అనారోగ్యం వస్తే ఎవరైనా ఉచితంగా చూపించుకోవచ్చని అన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు ఉచితంగా మందులు కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు శిరబోయిన ఎల్లయ్య, కాంగ్రేస్ డివిజన్ అధ్యక్షులు బోయిని దూడయ్య, బిసి మోర్చా జిల్లా అధ్యక్షులు కందిమల్ల మహేష్, మాజీ మార్కెట్ డైరెక్టర్ సంగరాబోయిన చందర్, చింతం రమేష్, రాజు, మోహన్ సాయి, ఆశాలు కవిత, రజిత, స్వర్ణలత, రాజమణిలతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్త, షుగర్, బీపీ మొదలైన పరీక్షలు చేయించుకొని సంబంధిత మందులు ఉచితంగా తీసుకున్నారు.

Related posts

ప్రధాన రహదారిపై పడిన గుంతలను పూడ్చివేత

చంద్రయపల్లిలో రోటరీ క్లబ్. కార్యవర్గ సభ్యులు పర్యటించారు

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి*

Jaibharath News