Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్

*డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్*

వరంగల్ జిల్లా//ఖిల్లా వరంగల్

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 22 వరంగల్ ప్రతినిధి:-

ఖిల్లా వరంగల్ పడమర కోట దళిత కాలనీలోని వీరుని గడ్డ నుండీ కుమ్మరికుంట వరకు నిర్మాణం చేస్తున్న మినీ బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ ప్రజలసౌకర్యర్థం, వర్షం నీరు పోవడానికి మినీ బాక్స్ డ్రైన్ నిర్మాణం చేస్తున్నారని. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించి డ్రైనేజీ నిర్మించాలని కాంట్రాక్టర్ కీ చెప్పారు. వరంగల్ తూర్పు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్ రావు సహకారంతో డివిజన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని. భవిష్యత్తలో కొండా దంపతుల సహకారంతో డివిజన్ ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, తాండ్ర సుధాకర్, ప్రవీణ్, గొర్రె రాజేష్, గొర్రె కుమారస్వామి, సూపర్ వైసర్, వర్కర్స్ పాల్గొన్నారు.

Related posts

గీసుకొండ మండల ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజు

Sambasivarao

గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన

అధికారుల పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి