Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మహిళ సంరక్షణ  రక్షణ కోసం ప్రభుత్వం కార్యక్రమాలు ఉపయోగించు కొవాలి

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 23 వరంగల్
ఐసిడిస్ వర్ధన్నపేట్ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ,ఆధ్వర్యంలో గంగాదేవిపల్లి శిక్షణ కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ కీ లింగ వివక్షత గృహ హింస నివారణ మహిళ రక్షణ చట్టాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగావర్ధన్నపేట ఐసీడీస్ -సీడీపీఓ డేబొరా, సర్వోదయ కార్యదర్శి పల్లెపాడు దామోదర్, గంగాదేవిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ రిసొర్స్ పర్సన్ కూసం రాజమౌళి హాజరైనారు. ఈసందర్భంగా  ఐసీడీస్ -సీడీపీఓ డేబొరా మాట్లాడుతూ మహిళ సంరక్షణ & రక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని ముఖ్యంగా సఖి వన్ స్టాప్ సెంటర్, జిల్లా మహిళా సాధికరత  స్వదార్ హోమ్స్ పని చేస్తున్నాయాని అన్నారు, సమస్యలలో ఉన్న మహిళలు 100, 181, ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోషన మాసంలో భాగంగా గర్భిణీ స్త్రీ లకు శ్రీమంతం చేయడం జరిగిందని తెలిపారు, ఐసిడిఎస్  ప్రాజెక్ట్ పరిధి అంగన్వాడీ టీచర్స్ తక్కువ ఖర్చుతో సులభంగా లభించే ఆహార పదార్థాలతో పౌష్టిక ఆహార ఉత్పత్తులను ప్రదర్శించారు, 22 హైస్కూల్ విద్యార్థులకు రక్త హీనత పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు సర్వోదయ కార్యదర్శి పల్లెపాడు దామోదర్ మాట్లాడుతూసర్వో దయ సంస్థ గత 15 సంవత్సరాలనుండి హింసకు గురి అవుతున్న మహిళలకు మహిళా సహాయక కేంద్రాల ద్వారా సుమారు 27000 ల కుటుంబాలను విచ్చిన్నం కాకుండా వివిధ రకాల సేవల ద్వారా బాధిత మహిళలకు అండగా నిలిచిందని అన్నారు. సర్వో దయ సంస్థ హన్మకొండ ,వరంగల్ జిల్లలో సఖి వన్, స్టాప్ కేంద్రాలను 24 గంటలు నిర్వహిస్తున్నా మని తెలిపారు. మహిళా సాధికారతకు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచితంగా వృత్తినైపుణ్య శిక్షణలు టైలరింగ్ , కంప్యూటర్స్ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించిందని అన్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల జీవన ఉపాధి మెరుగు పరచడానికి వడ్డీలేని రుణాలను అందించి సూక్ష్మ ,పరిశ్రమలు ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి కృషి చేసిందని అన్నారు. చొరవ చూపిందని అన్నారు
ఈ కార్యక్రమంలో ఊకల్ మెడికల్ ఆఫీసర్ మమతా మాట్లాడుతూ మహిళలు  బాలికల రక్షణ కోసం అవగాహనా  శిక్షణలో పాల్గొన్నా మహిళలు వారి వారి గ్రామాలలో తెలియజేయాలని సూచించారు
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్  సూపర్వైజర్ అరుణ, సువర్ణ, లలిత, మాదవి స్వప్న, చంద్రకళ, సంగెం  గీసుగొండ గ్రామాల నుంచి అంగన్వాడీ టీచర్స్, సర్వోదయ సంస్థ సభ్యులు కవి రాజ్, ఇందిరా, రవీందర్, అక్తర్, వాణి, సఖి వన్ స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సిలర్ శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

*దేశ వ్యాప్తంగా కోట్లల్లో డబ్బు కొల్లగొట్టిన సైబర్‌ నేరస్థుల జంట అరెస్టు*

Sambasivarao

గత 17 రోజులుగా గీసుకొండలో ఆమరన నిరాహార దీక్ష చేస్తున్న జాపర్తి కుమార్ ఘాడ్గేని నిమ్మరసంఇచ్చి విరమింపజేసిన బండ ప్రకాష్ నరేందర్ గౌడ్ పటేల్ వనజక్క

Sambasivarao

ఇల్లంద లో యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

Sambasivarao