Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మాటల ప్రభుత్వం కాదు – చేతల ప్రభుత్వం

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 23 హనుమకొండ మాటల ప్రభుత్వం కాదు – చేతల ప్రభుత్వం ఇది. అర్హులకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తాం. నాడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డు లు నేడు మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే.డిజిటల్ హెల్త్ కార్డు, రేషన్ కార్డుల పంపిణికి రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన ప్రతిమాట, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే తిరుతామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు మంగళవారం నాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజిపేట 47వ డివిజన్ బాలాజీ నగర్, భవాని నగరులలో రూ. 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజనులలో ప్రతి వార్డులలో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ ల నిర్మాణం పనులు చెప్పాడుతామని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మంజూరు చేసిన పనులను నిర్ణత సమయంలో పూర్తి నాణ్యత ప్రమాణాలు అమలుచేస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంతన్న నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడేడ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు లు, ఆరోగ్య శ్రీ కార్డులు అందిచమని మళ్ళీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలో త్వరలో అర్హులకు రేషన్ కార్డులను, డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారికీ ప్రభుత్వం సన్నద్ధం అవుతుందాన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధంగా ఉందన్నారు. డిజిటల్ రేషన్, హెల్త్ కార్డుల ప్రక్రియకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఒక పట్టణం, ఒక గ్రామాన్ని ఎంచుకునే విషయాన్నీ గుర్తు చేశారు. 47వ డివిజన్ అభివృద్ధి పర్యటనలో భాగంగా శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల పెళ్లికి సహాయకంగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మీ /షాది ముబారక్ చెక్కులను స్థానిక డివిజన్ కీ చెందిన బద్వాత్ చిన్న, ఎడ్ల రామకృష్ణ, షేక్ ఆఫ్జల్ పాషా లకు రూ. 300,348/-ల విలువ గల చెక్కులను 3 మంది లబ్ధిదారులకు అందించారు. రానున్న రోజుల్లో కళ్యాణ లక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటికి వచ్చి అందజేయడం జరుగతుందని తెలిపారు. కాజిపేట పరిధిలోని జూబ్లీ మార్కెట్ పరిసర ప్రాంతాలను సందర్శించారు. మార్కెట్ ఆవరణ సువిషాలంగా ఉన్నప్పటికీ చిరు వ్యాపారాలు రహదారి వేంట దుకాణాలను ఏర్పాటు చేయడం వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని వెంటనే సమస్య పరిసలష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర వేలం పాటలు

Jaibharath News

ఆగష్టు 31 వరకు అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు! జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు

కాళోజీ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించిన ఎంపీ కావ్య.

Sambasivarao