*సబ్సిడీ గ్యాస్ ధ్రువ పత్రాలు అందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి*.
వరంగల్ జిల్లా//నెక్కొండ మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 నర్సంపేట ప్రతినిధి:-
నెక్కొండ మండల కేంద్రంలోని ఇదునూరి రవి చౌక ధరల దుకాణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం, గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా అభయహస్తం క్రింద ప్రభుత్వంచే జారి చేయబడిన 500/- రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలెండర్ పథకానికి సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి అందించడం జరిగింది, ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకు 500/- రూపాయలకే గ్యాస్ సిలిండరునుఅందించడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి సబ్సిడీ గ్యాస్ అందుతుందని, సబ్సిడీ గ్యాస్ ఎవరికైనా రానివారు ఉంటే తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, గ్యాస్ పాసు బుక్ లను తీసుకెళ్లి స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ఆన్ లైన్ చేపించు కోవాల్సిందిగా తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టు కున్నదని, ప్రజలందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకో వాల్సిందిగా కోరు తున్నానని అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సబ్సిడీ అందని వారు ఎవరు ఉన్నా కూడా వారందరికీ అందే విధంగా అధికారులకు సూచనలు చేయడం జరిగిందని హరీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి, రామారపు రాము, ఈదునూరి ప్రభాకర్, సంగని వెంకన్న లెక్కల జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.