జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30హనుమకొండ
హనుమకొండ పరిధిలోని 51 వ డివిజన్లో కే ఎల్ ఎన్ కాలనీ అభివృద్ధి సేవ కమిటీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాలనీ అభివృద్ధి సమావేశం కాలనీ వాసుల పరిచయకార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారి సతీమణి నాయిని నీలిమ రెడ్డి పాల్గొన్నారు
కాలనీ వాసులు ఎమ్మెల్యే దంపతులను ఆత్మీయంగా సన్మానించుకుని, ప్రత్యేకంగా అభినందనాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో 50 లక్షల చొప్పున నిధులను కేటాయించడం జరిగిందన్నారు కే ఎల్ ఎన్ రెడ్డి కాలనీ అంటే మొత్తంనా ఆత్మీయులేనని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధి కోసం భవిష్యత్ లో మరిన్ని నిధులను కేటాయిస్తానని తెలిపారు
దసరా తరువాత వరంగల్లులో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని వారి రాక సందర్బంలో నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొండ నాగరాజు, కాంగ్రెస్ నాయకులు సబితా సమ్మి రెడ్డి, వేల్పుల అనిల్, కాలనీ గౌరవ అధ్యక్షురాలు కె జయశ్రీ కాలనీ ప్రెసిడెంట్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, కోశాధికారి సత్యనారాయణ, రాజారెడ్డి, కిషన్ రెడ్డి,కృష్ణ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, మొయిస్ అహ్మద్, సమ్మయ్య, కాలనీ పెద్దలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post