జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ అక్టోబర్ 3
హనుమకొండలోని మల్లిఖాంబా మనోవికాస కేంద్రంలో అంగవైకల్యం కలిగిన పిల్లలు తమలో ఉన్న నైపుణ్యంతో తయారుచేస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు (ఇకో ఫ్రెండ్లీ బాగ్స్) తయారీ యూనిట్ కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పిల్లలలో ఉన్న నైపుణ్యతపట్ల ఎమ్మెల్యే మంత్ర ముగ్ధులయ్యారు. సమాజంలో అన్ని ఉండికూడా శ్వాశక్తితో బ్రతకలేని ఎంతో మందికి మల్లికాంభ మనోవికాస కేంద్రం పిల్లలు ఆదర్శమని అన్నారు. క్లాత్ తో కూడిన బ్యాగులను తమ సహస్రలతో చేయడం పట్ల అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే. మహానగరంలోని ప్రముఖ వ్యాపార(కూరగాయల మార్కెట్, చిరు వ్యాపార సముదాయలు)కేంద్రలలో ఉపయోగించేలా ప్రచారం చేయాలనీ ఎమ్మెల్యే కోరారు. ప్లాస్టిక్ రహిత సంచులు ఉపయోగించడం వలన పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని వెల్లడించారు. బతుకమ్మ సందర్బంగా కేంద్ర ఆవరణలో పిల్లలు అందరు బతుకమ్మ ఆడారు. ఈ సందర్బంగా మల్లిఖాంభ మనోవికాస కేంద్ర నిర్వాహాకులను అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే నాయిని. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ బొంత సుజాత సారంగం, డివిజన్ అధ్యక్షులు వల్లెపు రమేష్, మాజీ కార్పొరేటర్ అబూబాకర్, టీపీసీసీ సోషల్ మీడియా నేహాల్ మరియు మల్లికాంబ మనోవికాస చైర్మన్ రామ్ లీలా, సదానందం, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
