Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవాలు ప్రారంభం

జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 22
వరంగల్ జిల్లా లోని ఓ’ సిటీ ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు ఈ క్రీడా పోటీలను జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దివ్యాంగులు అందరిలా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, సమాజంలో అందరితోపాటూ దివ్యాంగులు సమానమేనని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ క్రీడా మహోత్సవంలో పాల్గొన్న దివ్యాంగులందరికి జూనియర్స్ (10-17 సంవత్సరాల బాల బాలికలకు వేరువేరుగా ), సీనియర్స్ (18-54 సం. ల మహిళలు మరియు పురుషులకు వేరు వేరుగా) అన్ని విభాగాలలో ఆటల పోటీలు ( రన్నింగ్, వీల్ చైర్ రేస్, షాట్ పుట్, క్యారమ్స్, చెస్ ) నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన మొదటి విజేతలను హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపబడును. ఈ జిల్లా స్థాయి క్రీడలలో జిల్లా నలుమూలలకు చెందిన వికలాంగులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇందులో గెలుపొందిన విజేతలకు డిసెంబర్ 3న బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి బి రాజమణి, సిడిపిఓ విద్యా, దెబోరా,జూనియర్ అసిస్టెంట్ హేమలత, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ అనిరుద్,సూపెర్వైసర్స్ కళ్యాణి, కవిత, DHEW స్టాఫ్, సఖి స్టాఫ్, డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీస్ కు సంబందించిన కోచ్ లు మరియు సిబ్బంది, జిల్లా వైద్యరోగ్య శాఖ నుండి స్టాఫ్ నర్స్, పోలీస్ సిబ్బంది, పలు వికలాంగుల అసోసియేషన్ నాయకులు, దాదాపు 200 మంది వికలాంగులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు.

Related posts

పదోన్నతిపై బదిలీ అయిన బ్యాంకు ఉద్యోగి రమేష్ కు ఘన సన్మానం

Jaibharath News

దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు

పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Jaibharath News