( జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 23) వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంట గ్రామానికి చెందిన మాజీ సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గా పదవీ విరమణ చేసిన లేదళ్ల రవీందర్ ని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం నేషనల్ చైర్మన్ కలకోట్ల రాజ్ కుమార్ నేషనల్ ప్రెసిడెంట్ ఇనుముల షాంబాబు నియమించినారు. లేదల్ల రవీందర్ చిన్న స్థాయి నుండి జిల్లా అధికారిగా నిబద్ధతతో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి జిల్లా అత్యుత్తమ అధికారిగా ప్రభుత్వం గుర్తించిందని తన ఉద్యోగంలో బాధ్యతగా సక్రమంగా నిర్వహించి అధికారుల, ప్రజల మన్నలను చవిచూచారని అందులకు గాను లేదల రవీందర్ ని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం తెలంగాణ స్టేట్ సెక్రెటరీగా నియమించినామని తెలిపినారు .లెదల్లరవీందర్ మాట్లాడుతూ ఎక్కడైతే ప్రజలు సమస్యల కోసం ఇబ్బంది పడుతున్నారొ అక్కడ మా సంస్థ ద్వారా న్యాయం చేస్తానని న్యాయం జరిగే వరకూ మా సంస్థ పోరాటం చేస్తుందని అన్నారు. తనకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన చైర్మన్ రాజ్ కుమార్ కి, ప్రెసిడెంట్ ఇనుముల షాంబాబు కి కృతజ్ఞతలు తెలిపారు.

previous post