Jaibharathvoice.com | Telugu News App In Telangana
ములుగు జిల్లా

ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి.

(జై భారత్ వాయిస్ న్యూస్ ములుగు)
ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన కొనసాగిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, అనేక కష్టాలు పడుతూనే పైకి ఎదగాలని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.మంగళవారం గోవిందరావుపేట మండలం చల్వయి గ్రామంలోని పిఎస్ఆర్ గార్డెన్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఈజీ ఎంఎం సంస్థల వారి ఆధ్వర్యంలో నిర్వహించినమెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని సి జి ఎం ఎం స్పెషల్ కమిషనర్ సీఈవో బి. షఫీ ఉల్లా, కలెక్టర్ దివాకర టి. ఎస్, ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్ర, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పలు కంపెనీల సహకారంతో రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా మన జిల్లాలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరంగా ఉందని, ఇదే తరహాలో గత సంవత్సరం జూలై నెలలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఉపాధి జీవన ఉపాధి కోసం ప్రైవేటు ప్రభుత్వ రంగాలలో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు నిరుద్యోగులు కష్టపడి సాధించాలని, జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే జిల్లా నుండి 250 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని అన్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేయడం అవమానంగా భావించవద్దని, ఆయా కంపెనీలలో కష్టపడుతూ ఉన్నత స్థాయికి ఎరిగి మరో నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. కొంతమంది నిరుద్యోగులు ఉద్యోగ వేటలోనే ఉంటూ వ్యవసాయం వ్యాపార రంగాలపై దృష్టి సారిస్తున్నారని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయల రుణాలను మంజూరు చేస్తున్నదని తెలిపారు. ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన వారు నేడు అదే కంపెనీలకు సీఈఓ గా కొనసాగుతున్నారని, వేతనాలు తక్కువ ఇస్తున్నారని నిరాశ చెందకుండా ముందుకు సాగాలని సూచించారు.
తాను చిన్నతనం నుండే అనేక కష్టాలు ఇబ్బందులు పడి నేడు ఈ స్థాయికి ఎదిగానని తనను ఆదర్శంగా తీసుకొని నిరుద్యోగులుముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో 800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగా నేడు 12 వేల 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.ఉద్యోగ అవకాశాలు రాని పక్షంలో నిరుద్యోగులు నిరాశ చెందకుండా పుస్తక పట్టణ చేస్తూ వివిధ అంశాలపై అవగాహన కల్పించుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. రానున్న రోజులలో ఇదే తరహాలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.అనంతరం వివిధ కంపెనీలలో సెలెక్ట్ అయిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ పాత్రలను మంత్రి అందచేశారు.ఈ కార్యక్రమంలో పలు కంపెనీలకు చెందిన సీఈఓ లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, ఎల్ డి ఎం జయప్రకాష్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

మేడారం సమ్మక్క సారక్క ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది

Jaibharath News

దరఖాస్తు గడువు పొడిగింపు

Jaibharath News

కట్టు బొట్టు మన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలి.