( జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపన కృషి చేయాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య,పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి లు సంయుక్తంగా పిలుపునిచ్చారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (NISD) సౌజన్యంతో నెహ్రూ యువ కేంద్ర వరంగల్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) కార్యక్రమంలో భాగంగా బోల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో మాదకద్రవ్యాల నియంత్రణపై ఈస్ట్ బ్లాక్ సెమినార్ హాల్లో అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి (Nyk)నెహ్రు యువ కేంద్ర జిల్లా యువజన అధికారి చింతల అన్వేష్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ భారతదేశంలో డ్రగ్ దుర్వినియోగం ఒక పెరుగుతున్న సమస్యగా మారిందనీ, ఇది వ్యక్తులకే కాకుండా కుటుంబాలు మరియు సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందనీ, యువత ముఖ్యంగా డ్రగ్స్ వాడటం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటూ, మానసిక స్థిరత్వం కోల్పోవడమే కాకుండా, నేరాల పెరుగుదలకు కూడా కారణమవుతున్నారని చెప్పారు.వీటికి దూరంగా ఉన్నప్పుడే మంచి పౌరులుగా ఎదుగుతారని పిలుపునిచ్చారు.
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా గంజాయి మత్తులో పడి జీవితాలను పాడు చేసుకుంటున్నారని, క్షణిక ఆనందం కోసం నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దని, ఒకసారి అలవాటైతే అది వ్యసనంగా మారుతుందని మత్తుకు బానిసలు కావద్దని యువతకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా నార్కోటిక్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రవీందర్, సురేష్ లు మాట్లాడుతూ యువత కి మాదక ద్రవ్యాల కి బానిస కాకుండా ఉండడానికి సూచనలు చేశారు మరియు పిపిటి ప్రెజెంటేషన్ తో యువత కి మాదక ద్రవ్యాలు తీసుకుంటే యువత మరియు విద్యార్థుల జీవితంలో ఏ లాంటి అనర్థాలు జరుగుతాయో వివరించడం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్మి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు లేని భారత్ గా మార్చాలని చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డియస్పి సైదులు మాట్లాడుతూ తమ చుట్టూ పక్కల ఎవ్వరైనా మాదక ద్రవ్యాలు సేవిస్తూ కనిపిస్తే డైల్ 100 నెంబర్ హెల్ప్ లైన్ నంబర్ 1933 కి తెల్పవల్సిందిగా యువత ను కోరారు. గంజాయిని ఎవరైనా సరఫరా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కఠినంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రిసోర్స్ పర్సన్స్ గా నార్కోటిస్ డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రవీందర్, సైక్రియాటిస్ట్ డాక్టర్ భరత్ కుమార్, హెల్పింగ్ హాండ్స్ సొసైటీ ట్రైనర్ పొట్టబత్తుల రజిత లు వివిధ అంశాల పైన పిపిటి ద్వారా యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ సూరనేని శ్రీధర్, వాగ్దేవి కళాశాల ప్లేస్మెంట్ సెల్ డీన్ ఎస్ ఎస్ వి ఎన్ శర్మ, ఎంబీఏ డిపార్ట్మెంట్ HOD డా. వై భాస్కర్ రావు, ఎంబీఏ డిపార్ట్మెంట్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ మురళి, జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపెల్లి మధు, జక్కి శ్రీకాంత్, అధ్యాపక బృందం కార్యక్రమం లో పాల్గొన్న యువతతో అధికారులు మత్తు పదార్థాలు వాడమని ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా దూపకుంట చిరంజీవి కళాబృందం ఆధ్వర్యంలో మత్తు గంజాయి పై పాడిన పాటలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం యువతతో ప్రతిజ్ఞ చేపించి కార్యక్రమాన్ని ముగించారు.
