April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

mrps మాదిగల మహాగర్జన విజయవంతం చేయండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
హైదరాబాదులో ఈనెల 19న ఇందిరా పార్క్ లో నిర్వహించే మాదిగల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ మాదిగ రాష్ట్ర కార్యదర్శి ఆరేపల్లి బాబు మాదిగ వరంగల్ జిల్లా అధ్యక్షులు నమిండ్ల క్లైమే0ట్ మాదిగ కోరారు బుధవారం వరంగల్ జయశంకర్ జంక్షన్ వద్ద దీనికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో భోజన సదుపాయాలు విద్య ఆరోగ్య సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారుఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ముల బిక్షపతి జిల్లా ఉపాధ్యక్షులు చింత జోసెఫ్ జిల్లా కార్యదర్శి ఇల్లందుల సురేష్ యువసేన అధ్యక్షులు ప్రేమ్ సాగర్ గీసుకొండ మండల అధ్యక్షులు యాకోబు సంగెం మండల అధ్యక్షులు జంగిలి రాజు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు ఉగ్రా క్రమం అలంకరణలో దర్శనం

ఇకనుంచి ఆపదలో మీ నేస్తం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే