Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట)
ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది .పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కే అశోక్, ఉపాధ్యాయులు వాంకు డోత్ వాగ్య, భూక్యా వీరన్న, వొళ్లాల అశోక్, బిల్ల వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కాకాని అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ భూక్య ధర్మి , అంగన్వాడీ టీచర్ తేజావత్ కవిత పాల్గొన్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ పాఠశాల శోభాయ మానంగా మారింది. పాఠశాల హెచ్ఎం గా షేక్ పుఫీనా బేగం వ్యవహరించారు. ఎస్. కె అతీయా కౌసర్, జె. శ్రావ్య ,తేజా వత్ వనిత ప్రియ, తేజావత్ సుప్రియ, చైత్ర ,నఫీస బేగం, మహేష్, బిట్టు, శ్రీరామ్, నాగేష్ భవిష్య లు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఉపాధ్యాయులుగా మారి బోధించడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో అనంతరము జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల చిన్నారులను గ్రామస్థులు, విద్యాభిమానులు అభినందించారు.

Related posts

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు

పేద ప్రజల అభ్యున్నతే కొండా దంపతుల లక్ష్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి.

Sambasivarao