ఉదయం హోళీ పండుగలో ఎంజాయి రాత్రి భక్తి భావంతో జాతరకు వస్తారు భక్తులు తెలంగాణలోనే అతి పెద్ద ప్రభల జాతర అంటే కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాలలో కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర మార్చి 14 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఎంతో విశిష్టతగల కొమ్మాల జాతర అనగానే నాటి రాజకీయాలు కళ్లముందు కదులాడుతాయి. జాతరలో రాజకీయ ప్రభలు, మంది మార్బాలాలతో నాయకుల దర్పణం, పోటీపడి పెద్దఎత్తులో నిర్మించే ప్రభల దర్శనమిస్తాయి. రాజకీయ ప్రభల జోరు కొనసాగనుంది. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేలా అన్ని ఏర్పాట్లను చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం హోలి వేడుకల్లో మునిగి తేలి సాయంత్రం జాతరకు ఎడ్లబండ్లు ఇతర వాహనాలపై పై భక్తులు తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది. వరంగల్ మహానగరం నుంచి కూడా ఎడ్లబండ్లపై ట్రాక్టర్లు అటోలు ఇతర వాహనాలపై పెద్దసంఖ్యతో తరలివస్తారు. దీంతో వరంగల్ -నర్సంపేట రోడ్డులో బారులు తీరే ఎడ్లబండ్ల సవ్వడులు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తాయి. రంగులహోలి, నిండు పౌర్ణమి రోజు ఆలయం చుట్టు గోవిందా నామస్మరణలతో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల పై ఒంటె, గుర్రం, మేక, ఏనుగు వంటి భక్తి ప్రభలతో భక్తిపారవశ్యంతో భక్తుల చేసే కోలాహలం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
