(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట):
పదవ తరగతి ఉత్తీర్ణత విద్యార్థుల భవిష్యత్తు కు పునాది అవుతుందని ఖానాపురం మండలం మనుబోతులగడ్డ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమాండ్ల వెంకన్న అన్నారు.బుధవారం పాఠశాల లో జరిగిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు విడ్కో లు సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు వంద శాతం పాస్ కావాలని కోరారు. విద్యార్థులు కష్ట పడి చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కాకాని అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం సాధించి ఉన్నత స్థాయికెదగాలని కోరారు.విద్యార్థులు కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో రాణించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మంజుల, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పి రవీందర్, సుగుణాకర్ రెడ్డి, కే రవీందర్ ,ఎస్ రవి, బేర సుధాకర్ ఉమాదేవి, ప్రదీప్ కుమార్ లక్ష్మీపతి తో పాటు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వి వాగ్య బి వీరన్న, వి అశోక్, అర్పి మహేందర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల డ్యాన్సులు, సంస్కృతిక కార్యక్రమాలు ఉపాధ్యాయులను విద్యార్థులను అలరించాయి. ఈ కార్యక్రమాలు విద్యార్థులు పాఠశాలలో చదివిన అనుభవాలను సమావేశంలో తెలిపారు. విద్యార్థులకు ఎగ్జామ్ ప్యా డు లు, పెన్నులు పంపిణీ చేశారు
