Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పెన్షనర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి


జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
   రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం వరంగల్ జిల్లా శాఖ సమావేశం ఆదివారం నాడు వరంగల్ లోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో కర్రు సుధీర్ బాబు  అధ్యక్షతన జరిగింది.80 మంది పెన్షనర్లు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి వీరాస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలిశోజు రామ మనోహర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యన్ సదానందం  కార్యదర్శి నివేదికను, జిల్లా ఆర్థిక కార్యదర్శి వెలిశోజు రామ మనోహర్ ఆర్థిక నివేదికను ప్రవేశ పెట్టగా,సుధీర్ఘంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి వీరాస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలిశోజు రామ మనోహర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పెన్షనర్ల సమస్యలను సత్వరమే ప్రకటించాలని, ఆర్థిక పరిస్థితి నీ బూచి గా చూపి నిరాకరిస్తే ఉద్యమం ద్వారా సాధించుకోవడానికి  పెన్షనర్లు సిద్ధంగా ఉండాలని ” పిలుపు నిచ్చారు. అవసరమైతే ప్రస్తుతమున్న మంత్రి వర్గం, శాసన సభ్యులు ,శాసనమండలి సభ్యులు , మాజీ ప్రజాప్రతినిధులు,వివిధ కార్పొరేషన్ల కమిటీలు స్వచ్ఛందంగా తమ వేతనాలను ఒక సంవత్సరం పాటు తీసుకోకుండా సహకరించాలని కోరారు. మార్చి 2024 నుండి ఇప్పటివరకు రిటైర్ అవుతున్న వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని వారికి ఆ ప్రయోజనాలు అందించి ఆదుకోవాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ఐదు డి ఆర్/ డి ఎ లను బకాయిల తో మంజూరు చేయాలని, పి ఆర్ సి రిపోర్ట్ తెప్పించుకొని జూలై 2023 నుండి ఆర్థిక లాభం తో వర్తింప చేయాలని కోరారు. మీరు మ్యానిఫెస్టోలో ప్రకటించిన డిమాండ్ లనే మేము కోరుతున్నామని,అంతకు మించి ఏమీ కోరాట్లేదని గుర్తు చేశారు.వేదిక పైన వున్న జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ వీరయ్య, యన్ సదానందం, యన్ రవీందర్  మాట్లాడుతూ ” పెన్షనరి ప్రయోజనాలు 10 నుండి 20 శాతం వరకు తీసుకొని కొందరికి విడుదల చేస్తున్నట్లు తెలుస్తున్నదని, అది వాస్తవమైతే న్యాయ పోరాటానికి కూడా వెనుకాడ మని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జి నరసింహా రాములు  సమావేశకర్త గా వ్యవహరించగా, కలవచెర్ల హనుమంత రావు తీర్మానాలు ప్రవేశపెట్టగా, చర్చలలో  రవీందర్, మేడిశెట్టి సుధాకర్,కె కుమారస్వామి, ఎ భిక్షపతి,జ్యోతి రమణి, ఎ వనజ,కె సుధాకర్, కృష్ణకుమార్  గునిగంటి సాంబయ్య తదితరులు పాల్గొన్నార

Related posts

మనుబోతుల గడ్డలో ఘనంగా ప్రైమరీ లెవెల్ గ్రాడ్యుయేషన్ డేసెలబ్రేషన్స్

పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

విద్యుత్ ఉద్యోగులు సస్పెండ్