Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మిడివెల్లి పట్టాభి ఉద్యోగ విరమణ అభినందన సన్మానసభ

(.జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ) వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న మిడివెల్లి పట్టాభి ఉద్యోగ పదవీ విరమణ అభినందన సన్మాన సత్కార కార్యక్రమం, స్థానిక హైస్కూల్ మైదానంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సన్మాన సత్కార కార్యక్రమానికి స్థానిక హైస్కూల్ ఇంచార్జీ విటోభా గారు అధ్యక్షత వహించగా, వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి జ్ఞానేశ్వర్, జనగాం జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ , యూటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు చావ రవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో యూటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు రాజు, పిఆర్టీయు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గఫార్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మండల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి,గీసుకొండ ఎంపిడిఓ, ఎంఈవో, వివిధ మండలాల ఎంఈవో లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పట్టాభి బంధుమిత్రులు, విద్యార్థులు42 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఉపాధ్యాయ వృత్తిని క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి వేలాది మంది విద్యార్థులను ఉన్నతశిఖరాలను అధిరోహింహజేసిన పట్టాభి గారిని జిల్లా విద్యాశాఖాధికారి జ్ఞానేశ్వర్ అభినందించారు.

Related posts

ప్రజా పాలన ధరఖాస్తుల కంప్యూటరీకరణ జడ్పీ సిఈఒ పరిశీలన.

హైదరాబాద్ తరహాలో వరంగల్లులో కూడా హైడ్రా మంత్రి కొండా సురేఖ

yoga మే 1 నుండి రంగశాయిపేటలో యోగా శిక్షణ