Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబాబాద్ జిల్లా

కన్నీటి పర్యంతమైన మంత్రి సీతక్క ఎందుకంటే

నక్సలైట్ ఉద్యమంలో నేను ఎప్పుడో చనిపోయేదాన్ని, ఇది నాకు బోనస్ లైఫ్ (పునర్జన్మ)  రామన్న వర్ధంతి సభలో మంత్రి సీతక్క.
తన భర్త రామన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైన మంత్రి సీతక్క నక్సలైట్లు విధ్వంస కారులు  కారని, వారు సృష్టికర్తలని, భూనిర్వసత్వాన్ని ప్రశ్నించి, తిరగబడ్డ బక్క మనసులని, గోదావరి తీరానా చెయ్యి ఎత్తితే కార్జ్యాం కనిపించే బడుగులు రాము సీతక్క విప్లవ జంట అని నిరూపించింది. భారత విప్లవోద్యమ చరిత్రలో యువతకు నూతన అధ్యాయాన్ని, ఆదర్శపు నమూనాలు అందించిన  కల్పనా – దత్, పిసి జోషి – కైఫీ అగ్ని, సౌకర్- అజ్మీ, సుందరయ్య – లీల, నల్ల నరసింహ – వజ్రమ్మ, గీతా – రామస్వామి, శోభమ్మ – కె ఆర్ పి కోవలో నక్సల్ దంపతులు కుంజా రాము ధనసరి సీతక్క లు నిలిచారు.సీతక్క గారు ఉద్యమం నుండి వైదొలిగిన తర్వాత చాలా కాలానికి రామన్న వైదొలగారు. విశాల అరణ్యాన్ని, ఆదివాసీలను కంటికి రెప్పలా కాపాడుకొని వారి జీవితాల్లో ఒక భాగమై రామన్న జనజీవన స్రవంతిలో ఇముడలేకపోయాడు. భద్రాచలం రాజధానిగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల యొక్క ఆదివాసి ప్రాంతాలను కలుపుకొని ఆదివాసి రాష్ట్ర మన్య సీమ ఏర్పాటుతో  ఆదివాసి లిబరేషన్ టైగర్స్  ఫోర్స్ స్థాపించాడు. ఈ పోరాటంలో 2005 సంవత్సరంలో రాజ్య హింసకు బలయినాడు కుంజ రామన్న   వర్ధంతిని  పురస్కరించుకొని గురువారం మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం మోకాలపల్లి గ్రామంలో తన భర్త కామ్రేడ్ కుంజ రామన్న 21 వర్ధంతి సభలో మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా   మంత్రి సీతక్క  మాట్లాడుతూ కుంజ రాము వర్ధంతి సభ నిర్వహిస్తున్న ఆదివాసి సంఘాలకు ఆయన ఉద్యమ సహచరులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 17 సంవత్సరాల వయసులోనే కుంజా రాము ఉద్యమ బాట పట్టి చివరి వరకు ప్రజల కోసమే పరితపించారని అన్నారు. విప్లవోద్యమంలో విభేదాలు వచ్చి ఎర్రజెండా వదిలి ఆకు పచ్చ  జెండా పట్టిన రాము… ఎర్రజెండా వెలుగులోనే  చివరి శ్వాస వరకు ఆదివాసీలు, పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పరితపించారని అన్నారు. విప్లవోద్యమంలో ఆయన నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. రాము నేర్పిన విలువలతో ప్రజల కోసం పనిచేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ప్రజల కష్టాలు, శ్రమను గౌరవించడం తెలుసు, అందుకే ప్రజల కోసమే పనిచేయాలి అన్న సిద్ధాంతాన్ని ఆచరిస్తు, ఎవరికి అన్యాయం చేయొద్దు అన్న రాము మాటలే మాకు స్ఫూర్తి, అందరికీ న్యాయం జరగాలని అన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతూ మంత్రిగా ఉన్న ఇదే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. 30 సంవత్సరాలు పరిష్కారం కానీ ఎస్సీ వర్గీకరణను, 100 సంవత్సరాల్లో జరగని బీసీ కులగనను విజయవంతం చేసాము, అదేవిధంగా ఎస్టీల సమస్యలను పరిష్కరించి, అందరూ బాగుండాలి అన్న కుంజా రాము ఆశయాల సాధన కోసం పని చేస్తానని అన్నారు. కుంజ రాము వర్ధంతి సభ కోసం వచ్చిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆస్తులు అంతస్తులు, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పని చేస్తానన్నారు. అందుకే రాము మరణించి 20 సంవత్సరాలు అవుతున్న ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు మీరంతా ఇక్కడికి వచ్చారు. నేను కూడా ఉద్యమంలో ఎప్పుడో చనిపోయేదాన్ని, తృటిలో ఎన్నో ఎన్కౌంటర్ ల నుండి బయటపడ్డాను. ఇది నాకు బోనస్ లైఫ్, ఇదంతా నాకు పునర్జన్మే, మిగిలిన జీవితాన్ని ప్రజల కోసం సేవ చేయాలనీ ప్రజా జీవితంలో ఉన్నాను. ఈ జీవితమంతా ప్రజలకి అంకితం అని అన్నారు. మీరు అందించే బలంతో పేదరిక నిర్మూలన, ఆదివాసీలు అట్టడుగు వర్గాల హక్కుల రక్షణ కోసం కడదాకా నిలబడతా అంటూ…  తన భర్త కుంజ రాము జ్ఞాపకాలను గుర్తు చేసుకునే క్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు.

Related posts

మత్స్యకారుడి వలలో 32 కిలోల భారీ చేప

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Jaibharath News

తొర్రూర్ ఎస్ బి ఐ బ్యాంకులో చెలరేగిన మంటలు