Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తు గడువు ఫొడగింపు

రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగించి నందున జిల్లాలోని నిరుద్యోగ ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనారిటీ ,ఓ బి సి, ఈ బీసీ యువత రాజీవ్ యువ వికాస్ పథకానికి మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ ప్రజా పాలన సేవా కేంద్రాలలో మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు.  సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారీలు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రాజీవ్ యువ వికాసం పై వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు రాజీవ్ యువ వికాసం అమలలో భాగంగా వరంగల్ జిల్లాలో దరఖాస్తుల పరిస్థితిని జిల్లా కలెక్టర్  ఉప ముఖ్యమంత్రి కి వివరిస్తూ రాజీవ్ యువ వికాసం కింద ఇప్పటి వరకు 11,414 దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరిగిందని తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకించి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ప్రజాపాలన సేవా కేంద్రాన్ని  ఏర్పాటు చేశామని చెప్పారు.  మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించేందుకు గాను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఖాళీ దరఖాస్తు ఫారాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇప్పటివరకు   ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అన్ని దరఖాస్తుల ప్రింట్ కాపీలు తీసి సిద్ధంగా ఉంచుతామని తెలిపారు.  రాజీవ్ యువవికాసం కింద  స్వయం  ఉపాధి పొందేందుకు ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చేసుకునే విధంగా   అన్ని గ్రామాలు, మండల, మున్సిపల్ కేంద్రాలలో విస్తృత ప్రచారం కల్పిస్తామని, అలాగే మున్సిపల్ గార్బేజ్ ట్రాక్టర్ ద్వారా టామ్ టామ్ చేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.రాజీవ్ యువ వికాసం కింద జిల్లాలోని యువత స్వయం ఉపాధి పొందేందుకు ఏప్రిల్ 14 లోగా మండల,మున్సిపల్ ప్రజాపాలన సేవా కేంద్రాలలో మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాలని జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓ బి సి ,ఈ బి సి యువతను కలెక్టర్ కోరారు.రాజీవ్ యువ వికాసానికి సంబంధించి సందేహాల నివృత్తికి ఎంపీడీవోల ద్వారా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన హెల్ప్ డెస్క్ల ద్వారా ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు..వీడియో కాన్ఫరెన్స్ అనంతరము సంబంధిత అధికారులతో సమీక్షించి ఏప్రిల్ 3న జిల్లా పరిధి డిస్టిక్ లెవెల్ కన్సల్టెన్సీ కమిటీ ద్వారా బ్యాంకర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సదస్సుకు సంబంధిత కుల సంఘాలు మరియు దరఖాస్తుదారులను ఆహ్వానించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేయాలని ఎల్ డి ఎం హవేలీ రాజును ఆదేశించారు.ఈ పథకం అమలుకు జిల్లాలో ఎస్ సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారుఅంతకుముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాజీవ్ యువ వికాస పథకంపై మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం సుమారు 10 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిరుద్యోగ ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ, ఓబీసీ ,ఈ బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ పథకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అమలు చేయాలని, క్షేత్ర స్థాయి వరకు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి పథకం విధి విధానాలను స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు.జిల్లా మంత్రులు ,శాసనసభ్యులతో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి దరఖాస్తుల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, ప్రజలకు రాజీవ్ యువ వికాస్ పథకము విధివిధానాలను తెలిసే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. యువత వారి కాళ్లపై వారు నిలబడి స్వయం ఉపాధి పొందెందుకు ఇది చక్కటి అవకాశం అని, అందువల్ల ఈ పథకంలో పని చేసే ప్రతి ఒక్కరు మనసుపెట్టి పనిచేయాలని, రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే తేదీని పొడిగించాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకునే తేదీని పొడగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ పథకం కింద అర్హత పొందిన లబ్ధిదారులకు జూన్ 2 నుండు జూన్ 9 వరకు సాంక్షన్ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం దశలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఆన్లైన్లో దరఖాస్తుల ను స్వీకరించడంలో ఉన్న  ఇబ్బందులను అధిగమించేందుకు గాను అన్ని మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మాన్యువల్ గా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు. ఆన్లైన్ పోర్టల్ నుండి కేవలం ఖాళీ దరఖాస్తులు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలన్నారు . ఇక పై ఎలాంటి అప్లికేషన్లను ఆన్లైన్లో అనుమతించవద్దని,  ఇదివరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించిన అన్ని దరఖాస్తుల  కాపీలను ప్రింట్ తీసి ఉంచుకోవడంతోపాటు ,డేటా ఎంట్రీ చేయాలని చెప్పారు . ఇకపై రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తులను మండల ప్రజా పాలన సేవ కేంద్రాలలో తీసుకోవాలని, దరఖాస్తులను పూర్తిచేసి మండల ప్రజా పాలన కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలోని ప్రజాపాలన కేంద్రాలలో ఇవ్వాలని ఆయన పునరుద్గష్టించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీ, ఓ బి సి, ఈ బీసీ యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ అవి సరైన విధంగా అమలు కావటం లేదని, అందుకే రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించడం జరిగిందని, రాజీవ్ యువ వికాస పథకం లో నాణ్యతను ఏ విధంగా పెంపొందింప చేయాలో జిల్లా కలెక్టర్లు ఆలోచించాలని, ఈ పథకం కింద ఏర్పాటు చేసిన యూనిట్లు శాశ్వతంగా ఉపాధి పొందేలా ఉండాలని ,ప్రతి జిల్లాలో ఈ పథకాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు అధికారిని నియమించాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీధర్, తదితరులు సూచనలు, సలహాలు చేశారు.ఈ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా నుండిజిల్లా  అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి,డి ఆర్ ఓవిజయలక్ష్మి, జెడ్పి సీఈవో రాం రెడ్డి,డి ఆర్ డి ఓ కౌసల్యాదేవి. బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సౌజన్య, మైనారిటీ వెల్ఫేర్ అధికారి రమేష్, ఎస్సీ కార్పొరేషన్ సంక్షేమ శాఖ అధికారి భాగ్యలక్ష్మిసంబంధిత శాఖల అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
 

Related posts

కొమ్మాల దేవస్థానం ఆవరణలో ఘనంగా పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Sambasivarao

యూరియా విచక్షణా రహితంగా వాడొద్దు

ఎస్ఎఫ్ఐ పర్వతగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టలు సందర్శన

Sambasivarao