(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);పేదల మధ్యతరగతి ప్రజల కోసమే సన్న బియ్యం పంపిణీ చేస్తూ, ఆహార భద్రత, ఉపాధి హామీ చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింద ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలో రేషన్ షాపులో ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందనిఅన్నారు. ప్రభుత్వం ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసి ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తుందని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వని సంక్షేమ పథకాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటీ గా అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. కాంగ్రెస్ మైనార్టీల సంక్షేమానికి , భద్రతకు పెద్దపీట వేస్తున్నదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 14 నెలల్లో ఉచిత బస్సు ,ఉచిత కరెంటు, మహిళలకు పావులా వడ్డీ, మూడు సిలిండర్ల గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్లు, యువతకు ఉద్యోగ ఉపాధి వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమం లో ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, ఆత్మకూరు మాజీ పిఏ సి ఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు, మండలపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, ప్రధాన కార్యదర్శి వెలిదే వెంకటేశ్వర్లు, బరుపట్ల కిరీటి అయోధ్య, మైనార్టీ నాయకులు బాబుమియా (చిరు ), మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
