Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.మండల ప్రత్యేక అధికారి డి.సురేష్.

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ ల అమలును పకడ్బందీగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి డి.సురేష్ అన్నారు.
గీసుకొండ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయితి కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ల తో బుధవారo రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,
రాజీవ్ యువవికాసo, ఉపాధి హామీ పనులు,నర్సరీల నిర్వహణ,త్రాగు నీరు,పారిశుధ్యం,ప్రజపాలన లో వచ్చిన దరఖాస్థుల పై సమీక్ష నిర్వహించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన కోనాయమాకుల గ్రామములో చేపట్టిన ఇండ్ల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన లో వచ్చిన దరఖాస్తుల పరిశిలన చేపట్టాలన్నారు. వేసవి కాలంలో త్రాగు నీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు.జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమములో ఎంపిడిఓ వి.కృష్ణవేణీ,తహశీల్దార్ యం.డి. రియజుద్దిన్, యంపీఓ అడేపు ప్రభాకర్,సూపరింటెండెంట్ కమలాకర్, ఎపివో చంద్రకాంత్, ఎపీయం సురేష్ కుమార్,ఈసి శ్రీలత, షాజహాన్, శేఖర్,పంచాయితి కార్యదర్శులు, టీ ఏ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Related posts

మహిళలకు కుట్టు మిషన్ లు సర్టిఫికెట్లను అందజేసిన ఎంపీ కడియం కావ్య.

పత్రికా విలేకరిని చంపుతా అని బెదిరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి*

Sambasivarao

అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ