గ్రేటర్ వరంగల్ నగరంలోని స్టేషన్ రోడ్డు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ వల్లీ దేవసేన సమేతసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ప్రారంభమై భక్తుల భక్తి ప్రభక్తుల నడుమ కనుల పండుగగా సాగింది. ఆలయం ప్రధాన అర్చకులు లంకా శివకుమార్ వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు ఓం శరవణ భవాయ నమః అంటూ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఫౌండర్ ట్రష్టీ. ఆకార హరీష్ కుమార్ స్వాతిదంపతులు ఉమాదేవి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు జగన్మోహన్ శర్మ సంతోష్ శర్మ ఫణి శర్మ పశుపతి శర్మ కృష్ణమూర్తి శర్మ మొదలగువారు హాజరైనారు. ఆలయ సిబ్బంది వీరన్న సాగర్ లక్ష్మి అరుణ భక్తులు నాగలక్ష్మి సునీత పావని శర్వాణి ఉమాదేవి సరితా వందనా దేవి సుచిత పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తలంబ్రాలు, తీర్థప్రసాద, అన్నప్రసాద భక్తులకు వితరణ చేయడం చేశారు కార్యక్రమంలో ఆలయ ఈవో కిషన్ రావు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పాల్గొన్నారు..
